Monday 26 November 2012


           జైల్లో ఆరు నెలలు
 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ అరెస్టై ఆరు నెలలయింది. ఉప ఎన్నికలకు ముందు మే 27  సాయంత్రం ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆస్తుల కేసులో మూడు రోజులు యువనేతను  విచారించిన సీబీఐ ఆ తర్వాత అదుపులోకి తీసుకుంది . సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి సుప్రీం వరకు వెళ్లినా బెయిల్ రాకపోవడంతో .... చంచల్ గూడ జైలుకే పరిమితమయ్యారు జగన్ . వచ్చే ఏడాది మార్చి చివరినాటికి  కేసు విచారణ పూర్తిచేయాలని సీబీఐ ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అప్పటి వరకు బెయిల్  కోరవద్దని జగన్ ను కు సూచించింది. అయితే తనను అరెస్టు చేసి 90 రోజులు దాటినందునా బెయిల్ ఇవ్వాలని లేటెస్ట్ గా నాంపల్లి సీబీఐ కోర్టులో స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు జగన్.... దీనిపై కోర్టు తీర్పు రావాల్సి ఉంది.
జగన్ అరెస్ట్ తో  అందరూ వైసీపీ దుకాణం క్లోజ్ అనుకున్నారు. అయితే కొడుకు లేకున్నా పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు విజయమ్మ. ఉప ఎన్నికల్లోనూ  తల్లి, కూతరు ప్రచారం చేసి, 15 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. ఆ ప్రభావంతో ఇప్పుడు  వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. సీమాంధ్ర తో పాటు తెలంగాణలోనూ  ఇరత పార్టీల నేతలు  వైసీపీలో చేరుతున్నారు. అయితే ఇదంతా జగన్ వ్యూహమేనంటున్నారు ప్రత్యర్థులు. జైలు నుంచే ఆయన చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. పార్టీలో చేరుతున్న నేతలు ముందుగానే జగన్ తో ములాఖత్ అవుతున్నారు. దీంతో చంచల్ గూడ జైలు జగన్ గెస్ట్ హౌస్ గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.
మొత్తమ్మీద ఆరు నెలలుగా జైల్లో ఉంటూ కూడా  పార్టీని కాపాడుకోగలిగారు జగన్ . తల్లి , చెల్లిని  నిత్యం జనంలో ఉండేలా గైడ్ చేస్తూ  ప్రత్యర్థులకు దీటు గా సమస్యలపై ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారు.  ఇంతచేసినా ఆయన లేని లోటు పార్టీలో కనిపిస్తుందంటున్నారు వైసీపీ నేతలు .  జగన్ బయట ఉంటే ఇతర పార్టీల నుంచి వలసలు మరింత ఊపందుకునేవని చెబుతున్నారు. ఈసారైనా బెయిల్ వస్తుందేమోనని  ఆశతో ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment