నవ్విన
నాపచేనే పండిందన్న సామెత రాష్ట్రం నుంచి కొంతగా ఎంపికైన మంత్రుల విషయంలో నిజమైంది.
తమకు మంత్రి పదవొస్తుందని ముందే చెప్పిన ఎంపీలను చూసి సీఎం కిరణ్ నవ్వుకున్నారట.
కెబినెట్ మినిస్టర్ అంటే తామాషా అనుకున్నారా? నాతో అన్నారు సరే .... వేరేవాళ్లకు చెప్పకండి అభాసుపాలవుతారని
వెటకారమాడారట. ఫోన్ చేసి , మిమ్మిల్ని ఎవరో ఆటపట్టిస్తున్నారని చెప్పారట. ఢిల్లీలో ఏం జరిగినా అంతా తనకు
తెలుస్తుందన్నది సీఎం ధీమా . హైకమాండ్
తనను సంప్రదించకుండా మంత్రుల ఎంపిక చేయదని పిచ్చి భ్రమ. అయితే మంత్రివర్గ పునర్
వ్యవస్థీకరణ తర్వాత కిరణ్ ముఖం తెల్లబోయింది. సీఎంను చూసి నవ్వుకోవడం మంత్రుల వంతైంది. పాపం రబ్బర్
స్టాంప్ ... సీఎం కు ఏమీ తెలియదని జోకులేసుకున్నారు నేతలు.
సెంట్రల్
క్యాబినెట్ రీషపిలింగ్ లో సీఎం కు జలక్
ఇచ్చింది హైకమాండ్. మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి ఐదుగురిని తీసుకుంటున్నట్లు
మాటమాత్రమైన కిరణ్ కు చెప్పలేదు. సీఎం ను సంప్రదించకుండానే తన దగ్గరున్న ఫీడ్
బ్యాక్ ప్రకారం మంత్రుల పేర్లు ఖారారు చేసింది. ముఖ్యమంత్రిని కూరలో కరివేపాకులా
పక్కన పెట్టింది . దీంతో ముఖం చిన్నబోయింది. ఇది దేనికి సంకేతమన్న విషయం ఇప్పుడు
కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కిరణ్ కు రోజులు దగ్గరపడ్డాయన్న
గుసగుసలు వినిపిస్తున్నాయి.
సహజంగా
కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులను చివరి నిమిషం దాకా చాలా గోప్యంగా ఉంచుతారు.
కానీ.. ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించింది అధిష్ఠానం. నాలుగు రోజుల ముందే
సోనియాతో పాటు యువనేత రాహుల్ గాంధీ స్వయంగా ఎంపీలకు ఫోన్ చేసి, మంత్రివర్గంలోకి
తీసుకుంటున్నట్లు చెప్పి అభినందించారు. కేబినెట్ కార్యదర్శి కూడా ఎంపీలకు ఫోన్
చేసి 28న మంత్రివర్గ పునర్
వ్యవస్థీకరణ ఉంటుంది ... 27 నాటికి అందుబాటులో ఉండాలని చెప్పారు.. ఎవరికి మంత్రి పదవి స్తుందన్న విషయం
పేర్లతో సహా మీడియాలో వార్తలు వచ్చాయి. అయినా ఒక్క రోజు మందువరకు సీఎం విషయం
తెలియకపోవడం ఆశ్చర్యం.
ఇక్కడ మరో విశేషమేమంటే.. తమకు ఢిల్లీ నుంచి ఫోన్
వచ్చందని ఎంపీలు స్వయంగా కిరణ్ కు చెప్పినా ఆయన లైట్ గా తీసుకున్నారు. కేంద్ర
మంత్రి పదంటే ఆషామాషీ అనుకుంటున్నారా? అంటూ వెటకారమాడారట. ఢిల్లీలో
విలేకరుల సమావేశంలో ఉన్న బలరాం నాయక్ కు
ఫోన్ చేసి మరీ తన హాస్య చెతురత ప్రదర్శించారు సీఎంగారు. 26న గాంధీభవన్ లో జరిగిన
మీటింగ్ లో కిల్లి కృపారాణికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తనకు మంత్రి పదవి
వస్తుందని సీఎంకు చెబితే లోలోపల నవ్వుకున్నారట.
రాష్ట్రం
నుంచి ఒక్కరిద్దరికే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కిరణ్ భావించారు.
చిరంజీవితో పాటు మరొకరి చాన్సు ఉంటుందనుకున్నారు. ఏకంగా ఐదురుగికి అవకాశం
కల్పించింది అధిష్టానం. కొన్ని రోజుల కిందటే సోనియాను కలిసిన కోట్ల సూర్యప్రకాశ్
రెడ్డికి మంత్రి పదవి వస్తుందని సోనియా హామీ ఇచ్చారట. బంధువుల పెళ్లికార్డు ఇచ్చేందుకు
సోనియా దగ్గరికి వెళ్లిన సర్వేకు .. తీపి కబురు చెప్పారట మేడమ్. బలరాం నాయక్ ను 15 రోజుల కిందటే రాహుల్ గాంధీ
పిలిపించి మాట్లాడరట. మొత్తమ్మీద ప్లాన్ ప్రకారమే హైకమాండ్ సీఎం కు తిలియకుండా
సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది.