Friday 5 April 2013


         లోకేశ్ బ్యాక్ ఆఫీస్ 

టీడీపీకి పకడ్బందీ నెట్ వర్క్, బ్యాక్ ఆఫీస్ ఉంటాయి. వీటి సాయంతోనే చంద్రబాబు పార్టీని ఇన్నాళ్లు పటిష్టంగా నడుపుతున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీపై కాన్సంట్రేట్ చేస్తున్న చినబాబు లోకేశ్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నారు.  అయితే తండ్రి సెటప్ చేసిన నెట్ వర్క్  కాకుండా తనకంటూ ప్రత్యేక బ్యాక్ ఆఫీస్ రెడీ చేసుకుంటున్నారు. బహుషా ఇప్పుడున్నది అవుట్ డేటెడ్ అనుకున్నారేమో... అంతా కొత్త తరంతో బ్యాక్ ఆఫీస్ రెడీ చేసుకునేందుకు లోక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెటప్ ప్రధానంగా మీడియా వార్తలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది.  ఛానెళ్లను మానిటర్ చేస్తూ.... టీడీపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన వార్తలను ఇందులోని ఒక టీం విశ్లేసిస్తుంది.  ఈ ప్రణాళిక కోసం కొందరు సీనియర్ జర్నలిస్టుల కోసం లోకేశ్ అన్వేశిస్తున్నట్లు  ఎన్టీఆర్ భవన్ లో టాక్.
లోకేశ్ బ్యాక్ ఆఫీసులో రెండో కీలక టీం సర్వే స్పెషలిస్ట్... ఎప్పటికప్పడు సర్వేటీం చేసిన రిపోర్ట్ లను సేకరించి కంప్యూటర్ లను ఎక్కించి గతంతో పోల్చుతూ విశ్లేషణ చేయడం దీని విధి. ఇతర సర్వే ఏజేన్సీల రిపోర్టు, తమ వాళ్ల నివేదికలను  కలిపి రివ్యూ చేస్తుంది.  ఈ రిపోర్ట్ అనాలసిస్ లోకేశ్ స్వయంగా చేయనున్నారని సమాచారం. టీడీపీకి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తల్లో పార్టీ పరిస్థితి మేరుగు పడిందా.... వెనుక బడిందా అన్న వార్తల్ని కూడా బ్యాక్ ఆఫీస్ ప్రత్యేకంగా విశ్లేసించనుంది.
ఇక మరో ప్రధాన టీం ప్రతి నియోజకవర్గంలో  పార్టీ నాయకుల పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి కంప్యూటర్ లో ఎక్కిస్తుంది. సర్వేల ద్వారా వచ్చిన ఫలితాలతో విశ్లేసిస్తూ అభ్యర్థిని ప్రకటించడంలో తండ్రికి లోకేశ్ చేదోడు వాదోడుగా ఉంటబోతున్నారట. ముఖ్యంగా టీడీపీలో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి  విశ్లేషణ చేయటంలో బ్యాక్ ఆఫీస్ ప్రత్యేక పాత్ర పోశించబోతోంది. కేవలం కంప్యూటరీకరణ, సమాచార సేకరణే కాకుండా లోకేశ్ కు పార్టీ పై పట్టుసాధించేందుకు కూడా ఉపయోగపడుతుందన్నది పార్టీ నేతల భావన. మొత్తానికి ఏదోఒకరూపంలో లోకేశ్ వచ్చే ఎన్నికల్లోగా పార్టీపై పూర్తి పట్టుసాధించేందుకు కంప్యూటర్ల సాయంతో పావులు కదుపుతున్నారు.

Friday 1 March 2013



               హైదరాబాద్ లో ఆర్డీఎక్స్ 
  
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో  ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగులోకివస్తున్నాయి. అనుమానితుల విచారణలో భయంకమైన నిజాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరమైన  పేలుడు పదార్థం ఆర్డీఎక్స్  భారీగా  నిల్వ ఉన్నట్లు తేలింది.పాకిస్తాన్ నుంచి వయా బంగ్లాదేశ్ మీదుగా ఆర్ఢీఎక్స్ ఇండియాకు తరలించామని పేలుళ్ల నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ముంబై పేళ్లలో మొదటిసారిగా ఆర్డీఎక్స్ ఉపయోగించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. జైపూర్, మక్కా పేలుళ్లలో కూడా ఆర్డీఎక్స్ జాడలు కనిపించాయి. ఆ తర్వాత ముంబై రైళ్లలో ఆర్డిఎక్స్ ఆమర్చి పేలుళ్లకు తెగబడ్డారు టెర్రరిస్టులు.
1997లో  జునైద్ అలియాస్  ఇస్తియాక్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు పది కేజీల ఆర్డిఎక్స్ పట్టుకొచ్చినట్లు సమాచారం. ఇందులో మూడు కేజీలు కాశ్మీర్ లో పట్టుపడింది. మిగిలిన ఏడు కేజీలు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 1999లో సెంట్రల్ ఐబీ  అధికారులు ఆరు నెలలు కష్టపడి జునైద్ ను శివరాంపల్లిలో పట్టుకున్నారు. ఇతడి సహచరుడు సాజిద్ ను  కూడా అరెస్ట్ చేశారు. కానీ , వాళ్ల నుంచి ఆర్డీ ఎక్స్ ను స్వాధీనం చేసుకోలేపోయారు. కొంతమంది పోలీసులు అధికారులు సాజిద్ ను ఇన్మాఫార్మర్ గా మార్చి బంగ్లాదేశ్ పంపించారు. అయితే రెండేళ్ల తర్వాత అతడు ఐఎస్ ఐ ఏజెంట్ గా పశ్చిమబెంగాల్ లో ప్రత్యక్షమయ్యాడు. అసలు ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ సరిహద్దులు ఎలా దాటుతోంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి కేజీల కొద్దీ ఆర్డిఎక్స్ ఇండియాకు దిగుమతి అవుతుంటే మన నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? భద్రతా బలగాలు కళ్లుమూసుకుంటున్నాయా? ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
వందలామంది స్లీపర్ సెల్స్ నగరంలో తలదాచుకుంటున్నారు. అడపాదడపా ఒకరిద్దరు టెర్రరిస్టులు పట్టుపడుతున్నా... వాళ్ల దగ్గరున్న పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. దేశ, విదేశాలలలోని టేర్రరిస్టు బాసుల మాటలు సీక్రెట్ గా వింటున్న పోలీస్ అధికారులు... స్ధానికంగా ఉండే స్లీపర్ సేల్స్ ను పసిగట్టలేకపోతున్నారు.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్ తో తయారు చేసిన బాంబులు వినియోగించారు  ముష్కరులు . ఒక వేళ ఆర్డీఎక్స్ వాడి ఉంటే ప్రాణ నష్టం ఏ స్థాయిలో ఉండేదో ఊహించడం కష్టమే.  హైదరాబాద్ కు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకోకుంటే ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి తెగబడే అవకాశముందంటున్నాయి.

Sunday 10 February 2013



      వీర్యం స్మగ్లింగ్


జైళ్లలో ఉన్న బడా ఖైదీలకు బయటి నుంచి సెల్ ఫోన్లు, బిర్యానీ పార్శిళ్లు అందడం చూస్తాం. ఇందుకు భిన్నంగా ఇజ్రాయెల్ జైళ్లలో కొత్తరకం స్మగ్లింగ్ నడుస్తోంది. కారగారాల నుంచి ఏకంగా ఉగ్రవాదుల వీర్యం బయటకు రవాణా అవుతోంది. తమతో పాటే పోరాటం అంతం కాకుండా వారసులను కనేందుకు ఈ ప్లాన్ వేశారు ఉగ్రవాద ఖైదీలు. 
ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్నా ఉద్రవాదుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.తాముపోయినా వారసులు జీహాద్ ను కొనసాగించాలని కలలు కంటున్నారు. ఇందుకోసం ఏకంగా జైళ్ల నుంచి రహస్యంగా  భార్యలకు తమ వీర్యాన్ని రవాణా చేస్తున్నారు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ... ఇది నిజం.
దాడుల్లో పట్టుబడిన వేలాది మంది పాలస్తీనా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ జైళ్లలో  శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్లలో చాలామందికి 25 ఏళ్లకుపైగా   యావజ్జీవ  శిక్ష విధించాయి అక్కడి న్యాయస్థానాలు . దీంతో ఉద్రవాదుల లైఫంతా కారాగారంలోనే గడపాల్సిన పరిస్థితి . అయితే  పలువురు ఖైదీలు తమ వీర్యాన్ని జైలు బయటికి పంపించి భార్యలు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురు పాలస్తీనా మహిళలు ... తమ భర్తల వీర్యంతో కృత్రిమ పద్ధతుల్లో సంతానం పొందారు. ఓ ఖైదీ భార్య దలాల్ అల్ జిబెన్ ఈమధ్యే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్తకు ఇజ్రాయెల్ కోర్టు 27 ఏళ్ల యావజ్జీవ శిక్ష విధించింది. జెరూసలెం మార్కెట్లో బాంబుదాడులకు పాల్పడినందుకు మరో 25 ఏళ్ల కారగార శిక్షపడింది. ఇవన్నీ పూర్తయి అతడు బయటకు రావడం జరగని పని. మరొకరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడని దలాల్ ... భర్త ద్వారే బిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్లే చేసింది.  ఖైదీల్లో చాలామంది భార్యలది ఇదే పరిస్థితి.అయితే  కొన్ని దేశాల్లోలాగా ఇజ్రాయెల్ జైళ్లలో  ఖైదీలకు దాంపత్య కలయిక అవకాశం లేదు.
వైద్యులు చెబుతున్న ప్రకారం.. స్ఖలనం జరిగాక సాధారణ వాతావరణంలో వీర్యకణాలు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు జీవించి ఉండలేవు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న ఖైదీలు తమ వీర్యాన్ని కప్పులు, ఆయింట్ మెంట్ ట్యూబుల్లో  వెస్ట్ బ్యాంకు నాబ్లుస్ పట్టణంలోని 'రజాన్ మెడికల్ సెంటర్ ఫర్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్'కు తరలిస్తున్నారు. అక్కడ డాక్టర్ సలీమ్ అబు ఖైజరాన్ ఆ వీర్యంతో ఉగ్రవాదుల భార్యలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ వీలు కల్పిస్తున్నారు. 
ఇదంతా ఎలా సాధ్యమవుతోందని చెప్పడానికి ఖైదీల భార్యలు నిరాకరిస్తున్నారు. తన వద్ద ఉగ్రవాదుల వీర్యం నమూనాలు డజన్ల కొద్దీ ఉన్నాయంటున్నారు డాక్టర్ సలీమ్ .జైలు సిబ్బంది సాయంతో ఖైదీల వీర్యం బటయకు వెళుతోన్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి అవకాశమే లేదని జైలు అధికారులు కొట్టిపారేస్తున్నారు.  పాశ్చత్య దేశాల్లోలాగా ఖైదీలకు తమ భార్యలను కలుసుకునే అవకాశం కల్పించాలని వైద్యులు సూచిస్తున్నారు.