కేంద్రమంత్రివర్గ పునర్
వ్యవస్థీకరణ లో కొందరికి జాక్ పాట్ తగిలింది. మరికొందరికి టైమ్ బ్యాడ్ గా మారింది.
కొత్త ఎంపీలను అనుకోకుండా మంత్రి పదువులు వరించాయి. ఇక సీనియర్ల మినిస్టర్ల శాఖలు
తారుమారయ్యాయి. పదవి ఊడడం ఖాయమనుకున్న వాళ్లకు ప్రాధాన్యత కలిగిన శాఖలను
అప్పగించడం విశేషం.ఊహించినట్లుగానే రాహుల్
టీమ్ లోని యంగ్ స్టర్స్ జ్యోతిరాధిత్య సింథియా, సచిన్ పైలెట్ లకు
పదోన్నతలు లభించాయి. జ్యోతిరాధిత్య సింధియా కు విద్యుత్ శాఖ, సచిన్ పైలట్
కు కార్పొరేట్ వ్యవహారా శాఖ బాధ్యతలు
అప్పగించారు. సహాయమంత్రిగా పనిచేసిన పళ్లం రాజుకు మానవ వనురల అభివృద్ధి శాఖకు
మినిస్టర్ గా ప్రయోట్ అయ్యారు. జోడు
పదవులు నిర్వహించిన కపిల్ సిబాల్ , వీరప్ప మొయిలీ పదువుల్లో కోత పెట్టి కొత్త
బాధ్యతలు అప్పగించారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న వీరప్పమొయిలీకి ఈ సారి
పెట్రోలియం శాఖ దక్కింది. ఇప్పటి వరకు
పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డికి అంతగా ప్రాధాన్యత లేని శాస్త్ర
సాంకేతిక శాఖ అప్పగించారు.
తృణమూల్ కాంగ్రెస్
మినిస్టర్ రాజీనామాతో ఖాళీగా ఉన్న రైల్వేశాఖకు పవన్ కుమార్ బన్సాల్ కు
అప్పగించారు. ఇప్పటి వరకు పవన్ కుమార్ బన్సాల్
నిర్వహించిన జలవనరుల శాఖను కొత్తగా
హరీశ్ రావత్ కు కేటాయించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ ఖుర్షీద్ ను తప్పించడం ఖాయమనుకున్నారు.
అయితే ఊహించని విధంగా ఆయనకు విదేశీ వ్యవహారాల శాఖకు మార్చారు. కుర్షీద్ నిర్వహించిన న్యాయ శాఖను అశ్విన్
కుమార్ కు ఇచ్చారు. ఇక విస్తరణలో ప్రమోషన్ కన్ఫామ్ అనుకున్న పురందేశ్వరికీ బ్రేక్
పడింది. స్థానిక రాజకీయ సమీకరణల వల్లే చివరినిమిషంలో ఆమెను పక్కన పెట్టినట్లు
తెలుస్తోంది.క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ వచ్చినట్లే వచ్చి, చివరి నిమిషంలో
చేయిజారీ పోవడంతో పురందేశ్వరి తీవ్ర నిరాశకు గురయ్యారు.
మొత్తమ్మీద
కేంద్రకేబినెట్ విస్తరణ కొందరికి
ఆనందాన్ని పంచగా... మరికొందరికి అసంతృప్తిని మిగిల్చింది. పదవులు తారుమారైన నేతలు నిరాశకు లోను కాగా ... జాక్ పాట్ తగిలిన నేతలు సంబరాలు చేసుకున్నారు.
No comments:
Post a Comment