Monday 26 November 2012


కాంగ్రెస్ కు డిసెంబర్ గండం

కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ .... . తెంగాణపై టీ కాంగ్రెస్ ఎంపీల డెడ్ లైన్ అధికార పార్టీ నేతల  గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. డిసెంబర్ 9 తర్వాత అసమ్మతి అగ్ని పర్వతం  బద్దలవుతుందా? వలసల జోరు ఊపందుకుంటుందా?లోపే  పార్టీని రక్షించుకునేందుకు హైమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? రాష్ట్ర కాంగ్రెస్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ . డిసెంబర్ 9 ఫియర్ అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్  నేతలను వెంటాడుతోంది. తెలంగాణపై అధిష్టానం నిర్ణయం కోసం ఇంతకాలం ఎదురు చూసిన టీ కాంగ్రెస్  ఎంపీలు .... ఇప్పుడు తమకు తామే డెడ్ లైన్ విధించుకున్నారు. వచ్చే నెల 9 లోపు  కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ... తామే సీరియస్ డెసిషన్ తీసుకుంటామంటున్నారు. టీ ఎంపీల హాట్ హాట్ కామెంట్స్ ... ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల వలసలు  కాంగ్రెస్ పార్టీని   ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
తాజాగా  పార్లమెంట్ లాబీలో  పార్టీ అధినేత్రి సోనియాను కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖ సమర్పించారు టీ కాంగ్రెస్ ఎంపీలు . మేడమ్ సానుకూలంగా స్పందించారని నేతలు చెబుతున్నారు. రెండు రోజుల్లో పిలిచి మాట్లాడతానని చెప్పారంటున్నారు. అయితే తెలంగాణపై మూడేళ్లుగా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్న హైకమాండ్  పదిరోజుల్లో నిర్ణయం తీసుకుంటుందా? అన్న అనుమానం నేతలను వేధిస్తోంది. రాష్ట్రవిభజనపై స్పష్టమైన ప్రకటన రాకుంటే కేంద్రం తెలంగాణ  ఇవ్వదని భావించాల్సి ఉంటుందంటున్నారు  టీ కాంగ్రెస్ నేతలు  . తమదారి తాము చూసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు  వైసీపీలోకి జంపయ్యే  పరిస్థితి కనిపిస్తోంది.
డిసెంబర్ 9 గండాన్ని హైకమాండ్ ఎలా  అధిగమిస్తుందన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నందునా తెలంగాణపై నిర్ణయానికి ఇదే సరైన టైమ్ అంటున్నారు నేతలు . ఒక వేళ ఎమ్మెల్యేలు , ఎంపీలు  ఇతర పార్టీల్లోకి వలస వెళితే ... ఆ ప్రభావం రాష్ట్ర సర్కార్ తో పాటు  కేంద్రంపైనా ఉందంటున్నారు . చేతులు కాలాక ఆకులు పట్టుకున్నదానికంటే ... ముందే జాగ్రత్త పడడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. 

No comments:

Post a Comment