ఎర్రన్నఅంత్యక్రియలు పూర్తి
టీడీపీ
సీనియర్ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో శనివారం ఉదయం
పూర్తయ్యాయి. ఎర్రనాయుడు కుమారుడు
ఆయన చితికి నిప్పుపెట్టారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రియనేతకు కన్నీటి
వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడు
పార్థివదేహం వద్ద పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు
జరిపారు. అంతిమ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు, ఎర్రనాయుడు సహచర మిత్రుడు నాగం
జనార్ధన్రెడ్డి, హరీశ్వర్రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి
పాల్గొన్నారు.
No comments:
Post a Comment