సీఎం కిరణ్ పబ్లిసిటీ
సీఎం కిరణ్ ను ఇంకా పదవి పోతుందేమోనన్న భయం వెంటాడుతోంది.
కుర్చీని కాపాడుకునేందుకు పబ్లిసిటీని నమ్ముకున్నారు నల్లారి. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో మాజీ సీఎంలను మించిపోయారు.నేషనల్ మీడియాలో రోజూ ఏపీ అభివృద్ధి పథకాలపై అడ్వర్టైజ్ మెంట్లతో ఊదరగొడుతున్నారు.అధిష్ఠానం పెద్దల
మెప్పుపొందెందుకు నానా పాట్లు పడుతున్నారు. తాను పనిచేస్తున్నట్లు ఢిల్లీ పెద్దలను
నమ్మించేందుకు తెగ ఆరాపడుతున్నారు. తన మీడియా వ్యవహారాలు చూసుకోవడానికి స్పెషల్
ఆఫీసర్ ను నియమించుకున్నారు. ఇందిరమ్మబాట ప్రచారం కోసం ఫ్లైట్ టిక్కెట్లు ఇచ్చిమరీ
నేషనల్ మీడియాను రప్పించారు సీఎం.
ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా తన బొమ్మ
కనబడేలా చేసిన కిరణ్ ... ఢిల్లీ స్థాయిలోనూ పబ్లిసిటీకి ప్లానేశారు. సోనియా, రాహుల్ తో పాటు
కేంద్రమంత్రులు ఆజాద్ ,వయలార్ రవి, అహ్మద్ పటేల్ , ఏకే ఆంటోనీల ఇళ్లకు
వెళ్లే ఇంగ్లీష్ పేపర్లతో ప్రతిరోజూ యాడ్స్ ఇస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ ,ఏషియన్ ఏజ్ ,హిందూ బిజినెస్
లైన్ పేపర్లలో ప్రకటనలకు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. తెలుగు చానెల్స్ , పేపర్లకు ఆఫ్
మినిట్ , ఆర పేజీ యాడ్
ఇవ్వడానికి నానా యాగీ చేసే ఐ అండ్ పీఆర్ ... సీఎం నేషనల్ పబ్లిసిటీకి
ఇప్పటివరకు 8 కోట్లు
ఖర్చుపెట్టింది. సంక్షేమ పథాకాలు జనానికి అందుతున్నాయో లేదో తెల్సుకునే తీరక లేని
కిరణ్ ... సొంత ప్రచారం కోసం ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం దారుణమని
మండిపడుతున్నాయి విపక్షాలు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు
తెలియాలంటే రాష్ట్రంలో ప్రచారం చేయాలి .... డిల్లీలో ప్రకటనలిస్తే ఏం ఉయోగమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హైకమాండ్ దృష్టిలో పడేందుకు సీఎం కోట్లు
ఖర్చుచేయడంపై ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నాయి.
No comments:
Post a Comment