ఛార్జీల మోత
ఆర్టీసీ
బస్సెక్కితే బాదుడే.... డీజిల్ ధర పెంపును సాకుగా చూపుతూ ఛార్జీలను భారీగా
పెంచేసింది... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ప్రయాణికులను వీరబాదుడు బాదింది.
భారీగా చార్జీలు పెంచి జనంపై 363 కోట్ల భారం
మోపింది. సంపన్నులు ప్రయాణించే ఏసీ బస్సులను వదిలేసి గ్రామీణ , మధ్య తరగతి ప్రయాణించే పల్లె వెలుగు , సూపర్ లగ్జరీ సర్వీసులపై చార్జీల మోత మోగించింది. పల్లె వెలుగు బస్సు ఛార్జీని కిలో మీటరకు 5 పైసులు పెంచింది. ఎక్స్ ప్రెస్ , డీలక్స్ లకు కిలోమీటరకు 10 పైసలు , సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటరుకు 12 పైసలు హైక్
చేసింది. ఇటీవల కేంద్రం పెంచిన డీజిల్ ధర భారాన్ని ప్రయాణికులపై మోపింది రాష్ట్ర
రోడ్డు రవాణా సంస్థ. సిటీ ఆర్డినరీలో మినిమమ్ ఛార్జి 5 రూ.లు చేసింది. గతంలో 4 రూ. మినిమమ్
ఛార్జిగా ఉండేది. పెరిగిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
ఫ్లెక్సీ ఫేర్
విధానం
రద్దీని బట్టి
ఛార్జీలు పిండుకునేందకు కొత్తగా ఫ్లెక్సీ
ఫేర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది ఆర్టీసీ. ఇప్పటికే పండుగ, జాతర సమయాల్లో ప్రయాణికులను అడ్డంగా
దోచుకుంటున్న ఆర్టీసీ... ఇకపై వారాంతపు రోజులతో పాటు ముఖ్యమైన దినాల్లో
ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేయనుంది. ఆర్డినరీ జనరల్ బస్ టికెట్ తో పాటు
మెట్రో డీలక్స్ పాస్ లపై అదనంగా 100 రూపాయలు బారం పడింది. 14 నెలల్లో బస్సు
చార్జీలు పెరగడం ఇది రెండోసారి. నష్టాల నుంచి బయటపడేందుకు ఛార్జీలు
పెంచకతప్పలేదుంటున్నారు ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్. ఛార్జీల పెంపుపై సామాన్యులతో పాటు విపక్షాలు భగ్గున మండిపడ్డాయి. ప్రజలపై భారం మోపేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని ఫైరయ్యాయి.
ప్రైవేట్ సంస్థల అక్రమ రవాణను అరికడితే 1200 కోట్ల రూపాయలు
ఆర్టీసీకి ఆదాయంగా వస్తుందని సూచించారు సీపీఐ కార్యదర్శి నారాయణ
No comments:
Post a Comment