Wednesday 19 September 2012


అన్నా బృందంలో చీలిక

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో కేంద్రానికి కంటిమీద కునుకులేకుండా చేసిన అన్నా హజారే బృందం నిట్టనిలువునా చీలిపోయింది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఏర్పడిన విభేదాలు రెండు వర్గాలుగా విడిపోయేలా చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ, పార్టీ ఏర్పాటపై చర్చించేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం వాడివేడిగా జరిగింది. 9 గంటల పాటు జరిగిన  భేటీలో రెండు వర్గాలు మాటల దాడికి దిగాయి. పార్టీ వద్దంటున్న హన్నాను  కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డే సపోర్టు చేశారు. కేజ్రీవాల్ కు ప్రశాంత్ భూషణ్ , శాంత్ భూషణ్ లు మద్దతుగా పలికారు. హజారే ను కేజ్రీవాల్ టీమ్  సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఓ వర్గం ఫైరైంది. అయితే  అన్నాను  ఇప్పటి అన్నాగా తీర్చిదిద్దింది ఢిల్లీ వాసులేనని వ్యతిరే వర్గం ఘాటుగా సమాధానమిచ్చింది.
తన బృందం విడిపోవడం దురదృష్టకరమన్నారు హజారే. తాను ఏ పార్టీలో చేరేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కు పార్టీని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. అయితే తన పేరును, ఫోటోను ప్రచారానికి వాడుకోవద్దని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు  మెజారిటీ ప్రజలు మద్దతిచ్చారన్న కేజ్రీవాల్ సర్వే ఫలితాలను హజారే తోసిపుచ్చారు. రాజకీయ బాట పట్టే వారికి తన  ఆశీర్వాదాలుంటాయంటూనే... తాము భిన్న మార్గాలను ఎంచుకున్నామన్నారు. పటిష్టమైన లోక్ పాల్ పై జనంలో చైతన్యంతెచ్చేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేంద్రం బిల్లునైనా తేవాలని లేదంటే తన చావునైనా చూడాలని హెచ్చరించారు. మరోవైపు దేశం అమ్మాకాని సిద్ధంగా ఉందని   ట్విట్టర్ లో తెలిపారు కేజ్రీవాల్  . దేశాన్ని రక్షించేందుకు చేయాల్సిందంతా చేస్తానన్నారు. కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకున్న  హజారే ఢిల్లీలో యోగా గురువు బాబా రామ్ దేవ్ తో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

No comments:

Post a Comment